spot_img
Monday, March 23, 2026
spot_img

అత్యాచారం చేయడం పుణ్యకార్యం. అది కూడా జిహాద్ అంటున్న ముస్లీం గ్యాంగ్

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసిన దారుణన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఫర్హాన్ ఖాన్ నేతృత్వంలోని ఓ ముఠా హిందూ మతానికి చెందిన విద్యార్థినులను పథకం ప్రకారం లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడటం, వారిని మత మార్పిడికి బలవంతం చేసేందుకు యత్నించడం వంటి దారుణాలకు ఒడిగట్టింది.విచారణలో నిందితుడు పశ్చాత్తాపం చూపకపోగా, హిందూ యువతులపై అత్యాచారం చేయడం తన నమ్మకాల ప్రకారం “పుణ్యకార్యం” అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

తనపై అత్యాచారానికి పాల్పడి, ఇస్లాం మతంలోకి మారాలని ఫర్హాన్ బలవంతం చేశాడని 19 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫర్హాన్ నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ఇండోర్‌కు పారిపోయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి వేధింపులు కొనసాగించాడు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫర్హాన్, అతని అనుచరులు ప్రధానంగా ఇతర నగరాల నుంచి భోపాల్‌కు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది. ఇలాంటి యువతులపై సాధారణంగా తక్కువ ఆంక్షలు ఉండటం, ఒంటరిగా ఉండటంతో సులభంగా వలలో వేసుకోవచ్చని ముఠా సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. బాధితులను ఆకర్షించడానికి ఈ ముఠా సభ్యులు హిందూ పేర్లతో పరిచయం చేసుకోవడం, ఖరీదైన కార్లతో తిరుగుతూ డబ్బున్న వారిలా నటించడం వంటివి చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల విచారణలో ఫర్హాన్ తాను “హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం” అనే ఏకైక లక్ష్యంతోనే ఈ ముఠాను ఏర్పాటు చేశానని, తన చర్యలను ఒకరకమైన “జిహాద్”గా భావిస్తున్నానని అంగీకరించినట్లు సమాచారం. తాను చేసిన నేరాలకు పశ్చాత్తాప పడటానికి బదులుగా గర్వపడుతున్నట్లు నిందితుడు ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఐదో బాధితురాలు బయటకు వచ్చింది. ఏడాది క్రితం ఫర్హాన్, మరో నిందితుడు అలీ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. అశోకా గార్డెన్ ప్రాంతంలో భోజనానికి పిలిచి, గంజాయితో నింపిన సిగరెట్ ఇచ్చి మత్తులోకి దించిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు విడుదల చేస్తామని నిందితులు బెదిరించినట్లు పేర్కొంది.

ఈ కేసులో నేరాల సరళి, వ్యవస్థీకృత దుర్వినియోగం వంటివి 1992 నాటి అజ్మీర్ అత్యాచార కుంభకోణాన్ని గుర్తుకు తెస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ఫర్హాన్, అలీలపై సామూహిక అత్యాచారం ఆరోపణలపై కేసులు నమోదు చేసి, వారిని పోలీసు కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. ఈ నేరాల పూర్తి స్వరూపాన్ని వెలికితీసి, నిందితులందరినీ చట్టం ముందు నిలబెట్టేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular