రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే ఇంట్లో వివాహిత, యువకుడి ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే ఇంట్లో వేరు వేరు గదుల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వీళ్లిద్దరు దూరపు బంధువులు కాగా వరుసకు అక్కాతమ్ముళ్లు కావటం.. ఒకే ఇంట్లో సూసైడ్ చేసుకోవటం, అది కూడా వేరు వేరు గదుల్లో చేసుకోవటం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ డివిజన్ కేశవ్ నగర్ కాలనీలో సోమయ్య, చామంతి (26)దంపతులు నివాసముంటున్నారు.
వీళ్లిద్దరికీ పదేళ్ల క్రితం వివాహమవ్వగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శేఖర్..
డిగ్రీ పూర్తి చేసి, రాజేంద్రనగర్ హైదర్గూడాలోని తన పెద్ద బావ ఇంట్లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. చామంతికి శేఖర్ దూరపు బంధువు కాగా.. వరుసకు తమ్ముడి వరస అవుతాడు. ఇంత వరకు బాగానే ఉంది.




