ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్ను ఆశ్రయించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
కేఏ పాల్ పై పంజాగుట్టస్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు
RELATED ARTICLES