spot_img
Monday, March 23, 2026
spot_img

డాక్టర్ ను క్యాబిన్ లో చెప్పుతో కొట్టిన మహిళ

డాక్టర్లు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సమస్యలను పరిష్కరిస్తారు. ఎంత పెద్ద వ్యాధి ఉన్న కూడా మాటలతో వారికి ధైర్యం చెప్పి, ఆ తర్వాత చికిత్సతో వ్యాధిని నయం చేస్తారు.

ఇదిలా ఉండగా… మరికొందరు డాక్టర్లు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. బాధితులతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. అంతే కాకుండా.. తమ ఉద్యోగానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తారు. అచ్చం ఇలాంటి సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచిందిఒడిశాలోని పర్లాకిమిడి జిల్లాలోని ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్లాకిమిడిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న సౌదామిని రైతా అనే బాలిక ఫిబ్రవరి 22, 2023న హాస్టల్ క్యాంపస్‌లో ఉరివేసుకుని కనిపించింది. అయితే.. బాలిక చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పాఠశాల అధికారులు బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించగా, మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు. ఇది అప్పట్లో మిస్టరీగా మారింది. ఈ క్రమంలో.. తొలుత పర్లాకిమిడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తుపై కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.

నిన్న (మంగళవారం) ఉదయం, మరణించిన బాలిక తల్లి సుగ్యాని DHH ఆస్పత్రికి చేరుకుంది. తన కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ రష్మీ రంజన్ మిశ్రాపై అతని ఛాంబర్‌లో దాడి చేసింది. బాలిక శరీరంపై కనిపించిన గుర్తులను అతను (డాక్టర్) ప్రస్తావించలేదని ఆరోపించింది. కావాలనే డాక్టర్ తమకు అన్యాయం చేశాడని బాలిక తల్లి సుగ్యాని కంటతడిపెట్టింది.

ఈ క్రమంలో డాక్టర్ మిశ్రా ను అతని అందరు చూస్తుండగానే చెప్పుతో కొట్టి, దూషించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. బాలిక తల్లి చేస్తున్న ఆరోపణలపై కూడా విచారిస్తామని అదనపు వైద్యాధికారి ప్రదీప్ పాండా తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular