spot_img
Monday, September 29, 2025
spot_img

నెల్లూరులో మరో దారుణం..ఇంటికి పిలిచి ప్రియుడిని లేపేసిన ఇల్లాలు..

కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది.ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ఇల్లాలు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular