కేరళ లోని త్రిసూర్ సిటీలో( Thrissur City ) చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సైబర్ క్రైమ్( Cyber Crime ) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ముంబై పోలీస్ అధికారిగా మారువేషంలో ఉన్న మోసగాడు, సైబర్ నేర నిపుణులను మోసం చేయాలని ప్రయత్నించి పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే, ముంబై పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ సైబర్ క్రిమినల్ బాధితుడిని వీడియో కాల్ ద్వారా సంప్రదించాడు. తాను ముంబై పోలీస్ అధికారి అని చెప్పుకుంటూ, ఆ వ్యక్తిని భయపెట్టి మోసం చేయాలని ప్రయత్నించాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే, అతను సంప్రదించిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఓ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్.
సైబర్ క్రైమ్ ఆఫీసర్ సదరు స్కామర్( Scammer ) తనను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడని గ్రహించగానే, తన కెమెరా ఆన్ చేసి మోసగాడిని ఎదుర్కొన్నాడు. తాను నిజమైన పోలీస్ అధికారిని సంప్రదించాడని గ్రహించిన మోసగాడు, కంగుతిన్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించాయి.
త్రిసూర్ సిటీ పోలీస్( Thrissur City Police ) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే 167,000 కంటే ఎక్కువ వ్యూస్, 8,000 లైక్లు వచ్చాయి. మోసగాడి ఆశ్చర్యాన్ని చూపిస్తూ మలయాళంలో ఒక హాస్యభరితమైన క్యాప్షన్ను పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను చాలా ఫన్నీగా భావించి, పోలీసుల పనిని ప్రశంసించారు. “త్రిసూర్ పోలీస్, గ్రేట్ జాబ్!” అని ఒక కామెంట్లో రాశారు. మరికొందరు మోసగాడి ప్రతిచర్య గురించి వ్యాఖ్యానిస్తూ, “ఒక దొంగ పట్టుబడినప్పుడు నవ్వడం ఇదే మొదటిసారి” అని వ్యాఖ్యానించారు. మరికొందరు మోసగాడు ఇది కేవలం ఒక ప్రాంక్ అని చెప్పవచ్చు అని కూడా వ్యాఖ్యానించారు. ఈ ఘటన, సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. అందుకే, అనుమానాస్పదమైన కాల్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.