( BBC తెలుగు లో వచ్చిన కథనం ఆధారంగా )
డిజిటల్ అరెస్ట్ కేసులు రోజు రోజు కీ పెరిగి పోతున్నాయి.టార్గెట్ గా కొందరిని సెలెక్ట్ చేసుకొని భారీ గా డబ్బులు గుంజుతున్నారు సైబర్ నేరగాళ్లు.. ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా జాగ్రత్త ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.
ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో ఇటీవల డిజిటల్ అరెస్ట్ అయిన చండీగఢ్ వాసి హరినాథ్ కథ ఈయన ఎవరో కాదు మీడియాలో ఫోటో గ్రాఫర్ గా పని చేస్తాడు.వివరాల్లోకి వెళితే
భోపాల్కు చెందిన హరినాథ్ గత ఏడేళ్లుగా చండీగఢ్లో నివసిస్తున్నారు.ఒక వార్తాపత్రికలో ఫోటో ఎడిటర్గా పనిచేశారు 2017లో ఈ పని కోసం ఈయన చండీగఢ్ వచ్చారు.కరోనా సమయంలో హరినాథ్ ఉద్యోగం కోల్పోయారు. ఈయన భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె ఇంట్లో ట్యూషన్ కూడా చెబుతుంటారు. ఉద్యోగం లేకపోవడంతో భార్యతో కలిసి ఇంట్లో పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టారు హరినాథ్. “అక్టోబర్ 2న అర్ధరాత్రి 12 గంటలకు హరినాథ్ కు ఒక అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని, రెండు గంటల తర్వాత మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందన్నారు. ఆగస్టు 30న ముంబయిలో మీ ఆధార్ కార్డ్పై మొబైల్ సిమ్ జారీ చేశారని, ఈ సిమ్ కార్డ్పై మోసం చేసినట్లు ఏడు ఫిర్యాదులు, ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని ఆ అమ్మాయి చెప్పింది” అని అన్నారు.తనకి ముంబయిలో ఎవరూ తెలియదని, చండీగఢ్లో ఉంటానని చెప్పాను. తర్వాత వారు ఒక నకిలీ పోలీసు అధికారితో మాట్లాడించారు” హరినాథ్. తెలిపారు.ఆ నకిలీ పోలీసు అధికారి ” పెద్ద మోసం చేసావ్. నరేష్ గోయల్ అనే వ్యక్తి పెద్ద మోసం చేసి నీ పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచారు. ఈ ఖాతా నుంచి రూ.6 కోట్ల 80 లక్షల లావాదేవీ జరిగింది. ఇందులో 10 శాతం నీ పేరు మీద ఉంది. నీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నిన్ను అరెస్ట్ చేసేందుకు రెండు గంటల్లో పోలీసులు వస్తున్నారు.” అని భయపెట్టా రు అని హరినాథ్ చెప్పారు.కేసును ఆర్బీఐ, సీబీఐ, సుప్రీంకోర్ట్ దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సీబీఐ అధికారితో మాట్లాడిస్తామనీ ఆ నకిలీ పోలీస్ బెదిరించాడు అని హరినాథ్ తెలిపారు.
ముంబయికి రాలేకపోతే వేరే మార్గం ఉందని, ఇంట్లోనే ఉండి విచారణకు సహకరించాలంటూ సూచించారని హరినాథ్ అన్నారు.అనంతరం వాళ్లు హరినాథ్తో ”మీరు ఎల్లప్పుడూ మొబైల్ ద్వారా మాతో కనెక్ట్ అయి ఉండాలి. రేపు ఉదయం 10 గంటలకు మాట్లాడతాం. మీ ఆస్తుల వివరాలు మాకు చెప్పాలి. మీ ఖాతాలు, డిపాజిట్లపై ఆర్బీఐ దర్యాప్తు చేస్తుంది. మీరు నిర్దోషులుగా తేలితే, మిమ్మల్ని విడుదల చేస్తారు.” అని నమ్మకంగా తెలిపారు అని ఆయన చెప్పారు.
మరుసటి రోజు అంటే అక్టోబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు వీడియో కాల్ చేశారని హరినాథ్ చెప్పారు. ఈ కాల్లో సైబర్ దుండగులు హరినాథ్కు ఎంత డబ్బు, ఆస్తి ఉందని అడిగారు. రూ.9 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పినట్లు హరినాథ్ తెలిపారు.వెంటనే బ్యాంక్కి వెళ్లి డబ్బులు పంపించాలని అడిగారని, దీంతో అదే రోజు సాయంత్రం ఆన్లైన్లో ఎఫ్డీ బ్రేక్ చేశానని హరినాథ్ చెప్పారు. మరుసటి రోజు 4వ తేదీన మళ్లీ ఆన్లైన్ మీటింగ్ పెట్టారని అన్నారు.
”బ్యాంక్కి వెళ్లాక కూడా మీ ఫోన్లో వీడియో కాల్ ఆన్లోనే ఉంటుందని చెప్పారు. డబ్బు ఎందుకు, ఎవరికి పంపుతున్నారో వారికి చెప్పవద్దన్నారు. బ్యాంకులో ఎవరితోనూ మాట్లాడవద్దని మీటింగ్లో ఆయన నాకు సూచించారు” అని హరినాథ్ తెలిపారు
ఆ వ్యక్తులు ఎవరు? ఆర్బీఐ, సీబీఐ అంటూ వాట్సాప్ల ద్వారా నన్ను ఎందుకు సంప్రదిస్తారని వాళ్ళని అసహకపోవడం భయంతో అంతా నిజం అని నమ్మించారు ఫోటో జర్నలిస్టు అయిఉండి కూడా ఏదైనా కేసు నమోదు అయితే ఇలా జరగదు అని సదరు నకిలీ పోలీస్ ఆఫీసర్ను అడగలేదు..తనకు భయమేసింది. వాళ్లు ఏది అడిగితే అది చేశాను.” అని ఆయన అన్నారు.మొదట్లో వాళ్లు నిజంగా ఆర్బీఐ, సీబీఐ వాళ్లనుకున్నా, అనుమానించలేదు’ అన్నారు హరినాథ్.
“వీడియో కాల్స్లో నన్ను నిత్యం చూస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు. ఎవరికీ ఏమీ చెప్పవద్దన్నారు. నా భార్య పదేపదే అడిగినప్పటికీ నేను ఏంజరుగుతుందో అర్థం కాక ఆమెకు చెప్పలేదు” అని ఆయన అన్నారు.
అక్టోబరు 13న 99 వేల 999 రూపాయలు పంపాను. మరుసటి రోజు అంటే అక్టోబర్ 14న 2 లక్షల 80 వేలు పంపాను” అని హరినాథ్ చెప్పారు.
దీని తర్వాత సైబర్ దుండగులు హరినాథ్తో మాట్లాడుతూ.. ‘నీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటే మరో రూ.2 లక్షలు చెల్లించాలి’ అని చెప్పారు.
‘అక్టోబరు 16న అతనికి రూ.88,000 పంపాను’ అని హరినాథ్ చెప్పారు.
”దీని తర్వాత ఆర్బీఐ విచారణ పూర్తి చేసిందని, దాని రుసుము రూ.1.5 లక్షలనీ చెప్పారు. నా డబ్బు తిరిగి కావాలంటే, డబ్బులు చెల్లించాలని అనుకున్నా. అందుకే అక్టోబరు 22న వారి ఖాతాలో మరో రూ.1.5 లక్షలు వేశాను.” అని అన్నారు.
ఇదంతా జరిగాక తాను మోసపోయినట్లు హరినాథ్కు అర్థమైంది.అని అయాన కుటుంబంతో మాట్లాడాను. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లాను. సైబర్ సెల్ను సంప్రదించాలని వారు సూచించారు. సెక్టార్ 17లోని సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశా” అని హరినాథ్ అన్నారు.అక్టోబర్ 24న ఫిర్యాదు చేయగా, వీలైనంత త్వరగా ఫోన్ స్విచాఫ్ చేయాలని పోలీసులు సూచించారని చెప్పారు.
కేసుపై దర్యాప్తు జరుగుతున్నట్లు చండీగఢ్ సైబర్ పోలీస్ సూపరింటెండెంట్ కేతన్ బన్సల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని, ప్రజలకు అవగాహన కల్పించడమే కీలకమని చెప్పారు.
రూ. 51 లక్షలు ఎలా తెచ్చారు?
హరినాథ్ చండీగఢ్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పానిపట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయని, వాటిని అమ్మేసి మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశానని చెప్పారు.
”ఉద్యోగం మానేసిన తర్వాత 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు పొదుపు చేశాను. నా కారును రూ.1.71 లక్షలకు అమ్మేశాను. ఇది కాకుండా నా దగ్గర రూ.12-13 లక్షలు ఉన్నాయి. మరో ఫ్లాట్ కూడా అమ్మేశాను” అని చెప్పారు