spot_img
Monday, March 23, 2026
spot_img

మ్యాట్రిమోని సైట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పరిచయం.. రూ.6 లక్షలు చీటింగ్

ఆన్లైన్ మోసాల పై పోలీసులు ఎంత అవగాహన చేస్తున్న ..సైబర్ నేరాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. ఢిల్లీలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మహిళ ఆన్ లైన్ మోసానికి గురై అరు లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీ కి చెందిన మహిళలకు స్వీడన్‌కు చెందిన ఓ వ్యక్తి తనను తాను మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుంటూ మహిళతో మాటలు కలిపాడు.మోస పోయిన మహిళ ఢిల్లీ ప్రతాప్ నగర్ నివాసి. పోలీసులకు తన అనుభవాన్ని వివరిస్తూ, తాను సెప్టెంబర్ 15 నుండి ప్రదీప్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ఠాకూర్ తాను స్వీడన్ నుండి భారతదేశానికి మకాం మార్చాలనుకుంటున్నానని, ఢిల్లీలో స్థిరపడాలని ఉందని తన కోరికను వ్యక్తం చేశారు.

‘తన తల్లి మరియు 5 ఏళ్ల కుమార్తెతో కలిసి భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్నట్లు ఠాకూర్ నాతో చెప్పాడు. మేము నంబర్‌లను మార్చుకున్నాము, వాట్సాప్‌లో చాట్ చేసుకోవడం ప్రారంభించాము’ అని పోలీసు అధికారులకు మహిళ వెల్లడించింది.

లిస్బన్ నుండి ఢిల్లీకి విమానాన్ని బుక్ చేయమని తన ఏజెంట్‌కు సూచించినట్లు ఠాకూర్ తనకు తెలియజేశాడని మహిళ వివరించింది. అయితే, ఆ తర్వాత, ఏజెంట్ ముంబైకి వెళ్లే విమానాన్ని బుక్ చేశాడని, ఆ తర్వాత ముంబై నుంచి ఢిల్లీకి మరో విమానంలో వెళ్తానని చెప్పాడు.

ఊహించని పరిణామంలో, మహిళకు అక్టోబర్ 16న ప్రదీప్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయానని, సహాయం అవసరమని మహిళకు తెలియజేశాడు. తదనంతరం, ముంబైలోని కస్టమ్స్ అధికారిగా నటించిన మరో మహిళ నుండి ఆమెకు కాల్ వచ్చింది. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. రూ. 6 లక్షలు చెల్లిస్తే విడుదల చేస్తామని తెలిపింది. దీంతో ఆమె మాటలు నమ్మి ప్రదీప్ విడుదల కోసం రూ. 6 లక్షలు బదిలీ చేసింది. ఆ తరువాత అతడి నుంచి వాట్సాప్ కాల్ కానీ, ఫోన్ కాల్ కానీ ఏవీ లేవు. దాంతో తాను మోసపోయినట్లు గ్రహించానని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు, నవంబర్ 30న IPCలోని సెక్షన్లు 420 మరియు 34 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular