AI ఆధారిత వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. బాధితుడి తండ్రి గొంతును అచ్చుగుద్దినట్లుగా అనుకరించి “ఎమర్జెన్సీ” అంటూ ఫోన్ చేసి, నమ్మబలికి ₹18 లక్షలు వివిధ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయించారు.
ఫోన్ కాల్లో మాటల శైలి, స్వరం పూర్తిగా తండ్రి లాగానే ఉండటంతో కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం లేకుండా డబ్బులు పంపించారు. తర్వాత నిజం తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ హెచ్చరిక:
AI వాయిస్ కాల్స్ వస్తే వెంటనే నేరుగా సంబంధిత వ్యక్తికి మరో నంబర్ ద్వారా కాల్ చేసి నిర్ధారించుకోవాలి.




