spot_img
Monday, September 29, 2025
spot_img

సుధీర్‌ నేర సామ్రాజ్యం చూసి ఖాకీలు షాక్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ బడా నెట్‌వర్క్‌

జిల్లాలోని పది పోలీస్ స్టేషన్లలో నమోదైన 25కి పైగా క్రిమినల్ కేసుల్లో సుధీర్‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ మేరకు డ్రైవర్లపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన డి సుధీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కె తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు.

సుధీర్ నేర సామ్రాజ్యాన్ని చూసి పోలీసులు విస్తుబోయారు. కావలిలోని నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.7లక్షల నగదుతో, నాలుగు ఎయిర్ పిస్టల్స్, నాలుగు రైండ్ల మందుగుండు సామాగ్రి, రెండు కార్లు, 4 వాకీ టాకీలు, బేడీలు, రెండు జామర్లు, 20కిపైగా సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, కత్తులు, ఐరన్ స్టిక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు సుధీర్ పై 25 కేసులు నమోదైనట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అక్టోబరు 26న బస్సు డ్రైవర్లు బి రామ్‌సింగ్, శ్రీనివాసరావులపై దాడి, రోడ్డు స్థలం కావాలని మాజీలు హారన్‌ ఊదడంతో రక్తసిక్తమైన ఘర్షణ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుధీర్ సహచరులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular