spot_img
Monday, July 21, 2025
spot_img

హర్ష శాయి పై తన న్యూ*డ్ ఫోటోలు , వీడియోలు తీసి బెదిరిస్తున్నదంటూ కంప్లైంట్

యూట్యూబర్ హర్ష సాయి మీద.. ఓ యువతి రే*ప్ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.పెళ్లి పేరుతో తన దగ్గర రెండు కోట్లు డబ్బులు వసూలు చేసి తనను మోసం చేసాడని.. అలాగే పలు మార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ క్రమంలో తన న్యూ*డ్ ఫోటోలు , వీడియోలు తీసి బెదిరిస్తున్నదంటూ కంప్లైంట్ చేసింది. దీనితో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే హర్ష సాయి పరారీలో ఉన్నాడంటూ కూడా పలు కథనాలు వినిపించాయి. కానీ ఇంతలోనే హర్షసాయి దీనిపై స్పందించి.. నిజ నిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. దీనితో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ క్రమంలో హర్ష సాయి లాయర్ ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలను వెలుగులోకి తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

హర్ష సాయి లాయర్ టి చిరంజీవి .. ఈ కేసు విషయంపై ఈ విధంగా స్పందించారు. హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదని.. ఇవన్నీ అబద్దపు కట్టు కథలని. అతనికి అంత అవసరం లేదని చెప్పుకొచ్చారు. ‘అతను ఒక సక్సెస్ ఫుల్ యూట్యూబర్ .. అతను వీడియో పెట్టగానే మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే అతని పాపులారిటీ నాశనం చేయడానికి.. డబ్బు కోసం మాత్రమే ఆ అమ్మాయి ఇలా చేసింది. రెండు సంవత్సరాల ముందు వరకు కూడా వీరిద్దరికి ఎలాంటి పరిచయం లేదు. అలాగే ఆ బాధిత యువతి హర్ష సాయినే హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఓ సినిమా తీసేందుకు వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉంది. అలాంటిది హర్ష సాయి ఆమె వద్ద ఎందుకు డబ్బు వసూలు చేస్తాడు. ఈ క్రమంలోనే హర్ష సాయిని ఆమె షూరిటీ అడిగితే ఇవ్వలేదు. అప్పటినుంచే ఈ ఎలిగేషన్స్ మొదలయ్యాయి. అలాగే హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు. ఇక హర్ష సాయి నాన్న గారి మీద కూడా కేసు పెట్టారు. కానీ ఇంత వరకు హర్ష సాయి నాన్న రాధాకృష్ణ ఆ అమ్మాయిని ఇప్పటివరకు కలవలేదు. అసలు చూడలేదు కూడా. కాబట్టి అతని ఫేమ్ , డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు.’ అంటూ లాయర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుసుకుని న్యాయపరంగానే ఈ కేసును డీల్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. మీడియాలో పెట్టిన పోస్ట్ కానీ , ఇటు అతని లాయర్ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తుంటే.. హర్ష సాయికే ఎక్కువ సపోర్ట్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాధిత యువతి ఎవరు అనేది ఇంత వరకు తెలియదు. అలాగే పోలీసులు కూడా హర్ష సాయిని ఇంత వరకు కాంటాక్ట్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగించే పనిలో ఉన్నారు. కానీ హర్ష సాయి లాయర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా హర్ష సాయి కడిగిన ముత్యం అంటూ.. ఇది చట్ట ప్రకారం నిలబడే కేసు కాదంటూ చెప్తున్నారు. పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపితే కానీ.. అసలు నిజా నిజాలు ఏంటి అనేది తెలియదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular