యాంకర్ : సైబరాబాద్ పరిధిలో 29156 FIR లు నమోదు కాగా మొత్తం 3432 మందికి శిక్షలు పడేలా చేశాం అని తెలిపారు..సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ అవినాష్ మహంతి విడుదల చేశారు
1) వాయిస్ :- ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. Kp చౌదరి డ్రగ్స్ కేస్ లో త్వరలో కీలకమైన అరెస్ట్ లు ఉంటాయన్నారు.
2) వాయిస్ :- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కేసు దర్యాఫ్తు కూడా కొనసాగుతోందని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు తెలిపారు.ఎప్పటి లాగే ఈసారి కూడా ట్రాఫిక్ చాలనా వల్ల 104 కోట్ల పైన వసూల్ అయినట్టు తెలుస్తోంది.. షిటైమ్స్ ద్వారా 2587 మంది అరెస్ట్ కాగా 52 మంది పై పిడి యాక్ట్ పెట్టమని తెలిపారు..
GfX
సైబరబాద్ పరిధిలో ఈ సంత్సరం మొత్తం కీలక మైన నేరాలు
105 హత్యలు
62 చైన్ స్నాచింగ్ లు
62 రాబరిలు
7 డేకాయిటి
2353 దొంగతనాలు
616 కిడ్నాప్ లు
259 రేప్ కేసులు
6777 మోసాలు
116 హత్య యత్నాలు
3) వాయిస్ :-హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో సిబ్బంది రెండు నెలలు సమర్థవంతంగా పని చేశారన్నారు.
కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4,850 ఉంటే… 2023లో 5,342 కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా, ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. ఆర్థిక, స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ సంవత్సరం మహిళలపై నేరాలు పెరిగినట్లు చెప్పారు. అత్యాచారాలు తగ్గినట్లు తెలిపారు. 2022లో 316 అత్యాచారాలు నమోదయితే ఈసారి 259 నమోదైనట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 52 వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన చేసిన 24318 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు సస్పెండ్ చేశామని తెలిపారు..
4)వాయిస్ :- సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై త్వరలో సొల్యూషన్ దిశగా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాం అని..ట్రాఫిక్ పోలీసులకు మేము ఎలాంటి టార్గెట్ కు పెట్టలేదు…ట్రాఫిక్ ఉన్నప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రమే పోలీసులు దృష్టి పెట్టాలి..ట్రాఫిక్ పోలీస్ లు చలనాలకు పరిమితం అని తెలిపారు ఇదే కాకుండా ఎదైన మేజర్ క్రైమ్ జరిగినప్పుడు మీడియాకు అందుబాటు ఉండేలా ACP స్థాయి అధికారి నీ కానీ ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు
5) వాయిస్ :- నూతన సంవత్సర వేడుకలపై స్పందిస్తూ… ఈ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు.పోలిస్ ఆఫీసర్లు అందరూ రోడ్డు పై ఉండి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూస్తాం అన్నారు.నూతన సంవత్సర వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.12 తరువాత రోడ్డు పైన ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టం అని హెచ్చరించారు




