spot_img
Monday, March 23, 2026
spot_img

ఆర్కియాలజీ స్థలాలను సైతం క్లైయిమ్ చేసుకున్న వక్ఫ్ బోర్డు బైట పడుతున్న నిజాలు

దేశంలో అనేక ప్రాంతాలు, గ్రామాలు, దేవాలయాలను తమవని పేర్కొన్న వక్ఫ్ బోర్డు, తాజాగా కర్ణాటకలోని 53 కేంద్ర రక్షిత చారిత్రక కట్టడాలను సైతం తమవేని క్లైయిమ్ చేసుకున్నట్లు తాజాగా బయటపడింది.ఈ రక్షిత స్మారక కట్టడాలలో బీదర్, కలబురగి కోటలు, గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా, విజయపురలోని బారా కమాన్ ఉన్నాయి. ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ల ఏకైక రక్షణ, నిర్వహణలో ఉన్న ప్రదేశాలు. విజయపుర (లేదా బీజాపూర్) బీజాపూర్ సుల్తానేట్ లేదా ఆదిల్ షాహీ శకం (1490-1686) కాలం నుంచి దాని నిర్మాణ వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.యునెస్కో సైట్ మదర్సాగా..దక్కన్ హెరాల్డ్‌లోని ఒక నివేదిక ప్రకారం, వక్ఫ్ బోర్డు ఇప్పటికే 2005లో పేర్కొన్న 53 సైట్‌లలో 43 సైట్‌లను దాని స్వంత ఆస్థిగా ప్రకటించింది. ఫలితంగా చారిత్రక ప్రదేశాలకు విపత్తుగా మారాయి. వాటిలో అనేకం ఆక్రమణలకు గురికావడం, పాడుచేయడం, అశాస్త్రీయ పునరుద్ధరణకు గురయ్యాయి.ముల్లా మసీదు, యాకుబ్ డబులీ మసీదు, సమాధి – ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ చక్కటి నమూనాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్ చేయడానికి ప్రతిపాదించబడ్డాయి. అయితే ఇవన్నీ మదర్సాగా మార్చబడినట్లు ASI లోని కొన్ని వర్గాలు డెక్కన్ హెరాల్డ్‌కి తెలిపాయి. ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులు మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించబడ్డాయి. చారిత్రక నిర్మాణాలు “ప్లాస్టర్, సిమెంట్‌తో మరమ్మతులు చేయబడ్డాయి” అని నివేదికలు బయటకు వచ్చాయి.వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన 43 స్మారక చిహ్నాలలో అనేకం పాడైపోయాయని, కొన్ని “ప్లాస్టర్, సిమెంట్‌తో మరమ్మతులు చేయబడ్డాయి” అని అధికారి వార్తాపత్రికకు తెలిపారు. ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్లోరోసెంట్ లైట్లు,టాయిలెట్లు కూడా నిర్మాణించారు. కొన్ని ఆస్తులను దుకాణదారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించాలని 2007 నుంచి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజయపుర డిప్యూటీ కమిషనర్‌, మైనారిటీల సంక్షేమ శాఖ, కర్ణాటక ముఖ్య కార్యదర్శికి పలుమార్లు విన్నవించినా హక్కుల వివాదం కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.యాజమాన్య హక్కులపై వివాదంస్పష్టంగా, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR) లేదా PR కార్డ్‌లు (ఆస్తి యజమానికి ఇచ్చిన ప్రభుత్వ ధృవీకరణ పత్రం) ఆధారంగా రక్షిత స్మారక కట్టడాలపై వక్ఫ్ బోర్డు క్లైయిమ్ చేసుకుది. 2005 పత్రాల ప్రకారం, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ (మెడికల్ ఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సెక్రటరీ మహ్మద్ మొహ్సిన్ అప్పటి డిప్యూటీ కమిషనర్, విజయపుర వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ప్రకటన చేశారు.రెవెన్యూ శాఖ జారీ చేసిన ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్, ప్రామాణికమైన పత్రాల ప్రకారమే అంతా జరిగిందని మొహ్సిన్ డెక్కన్ హెరాల్డ్‌తో చెప్పారు. అయితే, 2012లో జాయింట్ సర్వే నిర్వహించినప్పటికీ, ఈ స్మారక చిహ్నాలు వక్ఫ్‌కు చెందినవని ఏఎస్‌ఐకి సరైన పత్రాలు లభించలేదని ASI అధికారులు వార్తాపత్రికకు తెలిపారు.మరిన్ని సైట్‌లు..శ్రీరంగపట్నంలోని మసీదు-ఇ-ఆలాతో పాటు హంపి సర్కిల్‌లో ఆరు స్మారక చిహ్నాలు, ASI బెంగళూరు సర్కిల్‌లో నాలుగు స్మారక చిహ్నాలను కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది ఈ నిర్మాణాలన్నీ 1914 నాటి బ్రిటీష్ ప్రభుత్వంచే తెలియజేయబడిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు.పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాల అవశేషాలు (AMASR) చట్టం, 1958 నియమాలు ఈ ఆస్తుల నిర్వహణ, పునర్నిర్మాణం, పరిరక్షణ కోసం “ఏకైక యజమాని”గా ASIని ప్రకటించాయి. ఒక నిర్మాణం ASI ఆస్తిగా తెలియజేయబడిన తర్వాత, దానిని డి-నోటిఫై చేయడానికి ఎటువంటి నిబంధనలు లేవు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular