ప్రసిద్ధ బ్లూచిప్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో బాధితులు Dh3.5 మిలియన్ల వరకు మోసపోయారు. కంపెనీ యజమాని రవీంద్ర నాథ్ సోనీ దుబాయ్లో అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ పరారీలో ఉన్నాడు.జూలై 3న బ్లూచిప్ గ్రూప్ పెట్టుబడి స్కామ్ తర్వాత, న్యాయం కోసం 15 మంది బాధితుల బృందం దుబాయ్లోని దీరాలోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో సమావేశమయ్యారు. వీరిలో 11 మంది ఏకంగా లక్షలాది దిర్హామ్లను మోసంలో కోల్పోయారు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరూ తమను తాము ఇంటర్పోల్ నుండి వచ్చినట్లు చెప్పుకుంటూ, తన సహచరులను పరిచయం చేసుకున్నారు. బ్లూచిప్ కంపెనీ లో 39 మిలియన్ దిర్హామ్లను కోల్పోయిన బాధితుల్లో ఒకరైన ప్రీతి రాకేష్ ఫిలిప్స్ .. వారిని నమ్మింది. అధికారులు బ్లూచిప్తో అనుసంధానించబడిన 70 మిలియన్ దిర్హామ్ల ఆస్తులను గుర్తించారని, పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని లిక్విడేట్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో మరింత మంది బాధితులు చేరి, గణనీయమైన మొత్తాలను సేకరించారు. మొత్తంగా ప్రీతి ఖాతాకు బదిలీ పరిమితి Dh99,000 కారణంగా, ఈ లావాదేవీలలో ఎక్కువ భాగం నగదు రూపంలో చెల్లించారు. కేవలం కొన్ని వారాల్లోనే సేకరించిన మొత్తం Dh3.5 మిలియన్లకు చేరుకుంది. దాదాపు 40 మంది వ్యక్తులు ఫండ్కు విరాళాలు అందించారని, మొత్తం Dh3.5 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది.బ్లూచిప్ నుండి మొత్తం నష్టాలు $100 మిలియన్లకు మించి ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా నిలిచింది.
లిక్విడేషన్ను కొనసాగించడానికి తప్పనిసరి కోర్టు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని, క్లెయిమ్లో ఐదు శాతం చెల్లించాలని వారు చెప్పారు.బాధితుల గ్రూప్కు భరోసా ఇవ్వడానికి, లీడ్ ఆఫీసర్ రసీదుని కూడా సమర్పించారు. దుబాయ్ కోర్టులు ఆ తర్వాతి రోజు ప్రీతీకి న్యాయవాదికి తిరిగి చెల్లించాలని సూచించారు. దాదాపు 198,000 దిర్హామ్లను పేర్కొన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేశానని, 33,000 నగదును అందజేసినట్లు ఆమె తెలిపారు. తరువాతి రోజుల్లో ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు నిర్ధారిస్తూ, చెల్లింపును వాగ్దానం చేస్తూ అధికారిక కోర్టు నోటీసులుగా కనిపించింది. నాలుగు రోజుల తర్వాత బాధితులకు కోర్టు తీర్పు వెలువడిందని నోటీసు అందినప్పుడు సందేహాలు మొదలయ్యాయని ప్రీతి గుర్తుచేసుకుంది. పత్రాల ఫోటోకాపీలు, తప్పిపోయిన పత్రాలు పేరిట “ఊహించని ఖర్చులు” కోసం అదనపు చెల్లింపులు కావాలని అడగటం ప్రారంభించారని తెలిపింది. అనంతరం మోసపాయినట్టు గ్రహించమని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న ఆస్తులు లేవు, కోర్టు ఆదేశాలు లేవు, ఇంటర్పోల్ అధికారులు లేరు. మొత్తం ఆపరేషన్ ఒక విస్తృతమైన కుంభకోణం. బాధితులకు చూపిన ఇమెయిల్ చిరునామాలు, రసీదులు, విధానపరమైన పత్రాలు అన్నీ నకిలీవి. బాధితుల్లో ఒకరు Dh165,000 చెల్లించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించడంతో కుంభకోణం బట్ట బయలైంది. అధికారులుగా పిలుచుకునే వారు మోసగాళ్లు తప్ప మరేమీ కాదని, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ప్రీతీపై కూడా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే, తాను కూడా బాధితురాలిని అని ప్రీతి చెబుతున్న, ఆమెను నమ్మిన కొందరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
దుబాయ్ లో బ్లూచిప్ స్కామ్.. లక్షల్లో మోసపోయిన బాధితులు..!!
RELATED ARTICLES