spot_img
Monday, July 21, 2025
spot_img

నాలుగేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

హైదరాబాద్‎లో విషాదం చోటుచేసుకుంది. చిన్నారితో కలిసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొప్పుల సాయి కృష్ణ..

భార్య చిత్రకళ, కూతురు తేజస్వినితో కలిసి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఉంటున్నాడు. కాగా.. వీరంతా ఈ రోజు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్రకళ బిర్లా ప్లానిటీరియంలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఆఫీసులో ఏదో సమస్య రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలానికి చేరుకున్న వారసిగూడా పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular