spot_img
Sunday, September 20, 2026
spot_img

తండ్రి ఫోన్ ఇవ్వలేదని 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

పిల్లలు స్మార్ట్ ఫోన్ కు బాగా అడిక్ట్ అయిపోయారు. ఎంతగా అంటే.. తిండి, నీరు, నిద్ర లేకుండా అయినా ఉండగలుగుతున్నారు. కానీ, చేతిలో ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క సెకను కూడా ఉండలేకపోతున్నారు.అంతగా వాటికి బానిసలైపోయారు. తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకపోతే.. కొందరు పిల్లలు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పిల్లల్లో ఈ విపరీత ధోరణి వారి తల్లిదండ్రులను, సభ్య సమాజాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా తండ్రి ఫోన్ ఇవ్వలేదని ఓ 16ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

మల్వాని ప్రాంతంలో నివాసం ఉండే బాలుడు ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు. ఫోన్ లో విపరీతంగా గేమ్స్ ఆడేవాడు. తిండి తిప్పలు మానేసి మరీ నిత్యం ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఇది బాలుడి తండ్రికి నచ్చేది కాదు. కొడుకుని ఆయన కోప్పడేవారు. అయినా కొడుకులో మార్పు లేదు. దీంతో ఇలానే వదిలేస్తే కొడుకు ఆరోగ్యం దెబ్బతింటుందని తండ్రి భయపడ్డాడు. కొడుకుని దారిలోకి తీసుకురావాలని అనుకున్నాడు. కొడుకు దగ్గరున్న మొబైల్ ని తండ్రి లాగేసుకున్నాడు.నవంబర్ 16న రాత్రి సమయంలో కొడుకు ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఇది గమనించిన తండ్రి కొడుకు మీద కోప్పడ్డాడు. నాలుగు చీవాట్లు పెట్టాడు. కొడుకు చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నాడు. ఇక ఫోన్ చూసింది చాలు వెళ్లి పడుకో అని చెప్పాడు. తండ్రి చేసిన పనితో కొడుకు తట్టుకోలేకపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి ఇచ్చేయాలని ఎంతో ప్రాథేయపడ్డాడు. ఆ తర్వాత గొడవకు కూడా దిగాడు. అయినా తండ్రి వినలేదు. ఫోన్ ఇవ్వలేదు. తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఎంత అడిగినా తండ్రి ఫోన్ ఇవ్వకపోవడంతో బాలుడు ఆవేశానికి లోనయ్యాడు. తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా కిచెన్ లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కాసేపటి తర్వాత తండ్రి వచ్చి చూడగా.. కిచెన్ లో హుక్ కి (కొక్కీ) కొడుకు వేలాడుతూ కనిపించడం చూసి షాక్ కి గురయ్యాడు. వెంటనే కొడుకుని కిందకి దించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఫోన్ కోసం బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది., పిల్లలు ఇలా తయారవడానికి కారణం తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు. పిల్లలు అడిగారని వెంటనే స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. తమ పనులు పూర్తి చేసుకోవడానికి తల్లిదండ్రులే తమ పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. అలా వారికి అలవాటు చేస్తున్నారు.పిల్లలు ఫోన్ కు బానిసల్లా తయారవకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. పిల్లలకు ఫోన్ దూరంగా ఉంచాలి. చదువు మీద, ఆటల మీద వారి దృష్టి మళ్లించాలి. బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఫోన్, టెక్నాలజీ.. ఈ రెండింటినీ ఏ విధంగా వాడుకోవాలి అనే అంశంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎక్కువ సేపు ఫోన్ చేస్తే కలిగే చెడు పరిణామాలను వారికి వివరించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular