spot_img
Sunday, March 22, 2026
spot_img

ఫేక్ ప్రిస్క్రిప్షన్ తో 100 ఇంజక్షన్ ఆర్డర్‌.ఆసుపత్రి లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.

రంగారెడ్డి:…….

రాజేంద్రనగర్ డ్రగ్స్ కేసులో 5 మంది అరెస్ట్.

సమీర్ ఆసుపత్రి పై నార్కోటిక్, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తో పాటు రాజేంద్రనగర్ పోలీసుల దాడులు.

ఆసుపత్రి లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.

సమీర్ ఆసుపత్రి చైర్మన్ షోయబ్ సుభానీ, డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్, ఫార్మాసిస్ట్ నసీరుద్దీన్, ఎక్జిక్యూటివ్ ఫార్మాసిస్ట్ మహ్మద్ జాఫర్, మెడికేర్ ఫార్మా డిస్టిబ్యూటర్ మ్యానేజింగ్ పార్టనర్ గోపు శ్రీని‌వాస్ ల అరెస్ట్.

పరారీలో డాక్టర్ ఆషాన్ ముస్తఫా ఖాన్.

ఆరు మంది కుమ్ముకై డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల‌ విచారణ లో వెల్లడి.

ఒక్కొక్క ఇంజక్షన్ ను 5 వేల నుండి 6 వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠా సభ్యులు.

ఇంజక్షన్ల కోసం ఫేక్ ప్రిస్క్రిప్షన్. పెద్ద మొత్తంలో ఇంజక్షన్ లు విక్రయించినట్లు సమాచారం.

57 రూపాయల ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ లో 6 వేయిలకు విక్రయం.

ఆసుపత్రి లో రోగులకు ఇంజక్షన్ వాడినట్లు ప్రిస్క్రిప్షన్ లో పేర్కొన్న సిబ్బంది.

ఆసుపత్రి లో ఉన్న రికార్డ్స్‌ ను క్షుణ్ణంగా పరిశీలించి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

ఏ ఒక్క రోగికి ఇంజక్షన్స్ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు.

ఫేక్ ప్రిస్క్రిప్షన్ తో 100 ఇంజక్షన్ ఆర్డర్‌.

43 ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించినట్లు సమాచారం.

57 ఇంజక్షన్లు సీజ్ చేసిన అధికారుల బృందం.

పట్టుబడ్డ ఐదుగురి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కటకటాలకు తరలింపు.

గుట్టు చప్పుడు కాకుండా 5 గురిని జైల్ కు తరలించిన రాజేంద్రనగర్ పోలీసులు.

డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మొపుతున్న అధికారులు.

డ్రగ్స్ ను నిర్మూలించాల్సిన అవసరం అందరి పైన ఉంది.

డ్రగ్స్ ను విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలకు చేరకుండా పకడ్బందీ చర్యలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular