హైదరాబాద్ లోని ఆ సంస్థ యాజమాని అట్లూరి పద్మ.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిలకు వియ్యంకురాలు కావడం గమనార్హం.
ఆమె ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం జరిగింది.
చట్నీస్ హోటల్స్ హైదరాబాద్ సిటీలో ఎంతో ఫేమస్. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. పదేళ్లుగా చట్నీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఊహించని విధంగా ” చట్నీస్ హోటల్స్ పై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేయటం..
వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రముఖ అల్పహార హోటల్ సంస్థ చట్నీస్ హోటల్ కు బిగ్ షాక్ ఐటీ అధికారులు సోదాలు
RELATED ARTICLES




